Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరమగ్గాల కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన గోశికొడ రాంప్రసాద్ నాలుగు మరమగ్గాలను నడుపుకుం టూ కుటుంబాన్ని పోషించే వాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెండ్లి సంబంధాలు చూస్తు న్నారు. అప్పు చేసి పెండ్లి చేయొద్దని, రెండు సంవత్స రాలు ఆగి చేద్దామని రాంప్రసాద్ అనుకున్నాడు. కానీ ఇంకా ఇద్దరు కుమార్తె లు ఉన్నారనీ, పెద్దామెకు ఎలాగైనా ఇప్పుడు చేద్దామని భార్య అంది. అయితే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న రాంప్ర సాద్, ఇప్పుడు కుమార్తె పెండ్లికి ఎలా అని ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మరమగ్గాల కార్ఖా నాలో రాంప్రసాద్(52) ఉరే సుకున్నారు. నేత కార్మికుడి మృతదేహానికి తెలంగాణ రాష్ట్ర మరమగ్గాల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ నివాళ్లర్పించారు. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యు లను వివరాలడిగి తెలుసుకు న్నారు. అనంతరం కూర పాటి రమేశ్ మాట్లాడు తూ.. బతుకమ్మ చీరల ఉత్పత్తి కోసం ఇక్కడి యజమానులు, చేనేత జౌళిశాఖ అధికారులు గుడ్డ ఉత్పత్తి చేస్తున్న వారిని ఆపించి రెండు నెలల పాటు వారి ఉపాధిని దెబ్బతీశా రన్నారు. కార్మికులకు రూ.200 రోజువారీ కూలి ఇస్తామని ఇవ్వకపోవడంతో వారు ఆర్థికంగా కుంగిపోయారని అన్నారు. గోశికొండ రాంప్రసాద్ మృతికి కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుడి ఆత్మహత్యకు కారణంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మరమగ్గాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.