Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:నగరంలోని ఓ పోలీస్ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీస్ అధికారి నుంచి రూ.14లక్షలు కొల్లగొట్టారు. మూడేళ్ల క్రితం సదరు పోలీస్ అధికారి రూ.45లక్షల విలువైన బీమా పాలసీలను చేశారు. వీటికి నెలవారీ ప్రీమియంలను చెల్లిస్తున్నారు. కొద్ది నెలలకు ఆయనకు డబ్బు అవసరం కాగా.. బీమా పాలసీపై రుణం కావాలని కంపెనీ అధికారులను కోరాడు. వారు నిరాకరించడంతో తాను చెల్లించిన డబ్బు మొత్తం వెనక్కి ఇవ్వాలని కోరారు. దిల్లీలోని తమ అధికారులను సంప్రదించాలని సూచించారు. అంతర్జాలం ద్వారా నంబరు తీసుకుని కొద్దిరోజుల క్రితం ఫోన్ చేశారు. వారు సమాధానం ఇవ్వలేదు. ఈ నెల 2న బీమా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం అంటూ ఫోన్ చేశారు. మీరు చేసిన బీమా పాలసీలకు రూ.50లక్షలు బోనస్ వచ్చిందని చెప్పారు. రూ.50లక్షల చెక్కు సిద్ధంగా ఉందని దీన్ని తీసుకునేందుకు డిపాజిట్గా రూ.14లక్షల నగదు తమ ఖాతాలో జమ చేయాలని సూచించారు. ఆయన పది రోజుల వ్యవధిలో దశల వారీగా రూ.14.02లక్షలు జమ చేశారు. ఈనెల 13తేదీన బీమా కంపెనీ ప్రతినిధికి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.