Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ డీఎస్సీ-2018 హాల్టికెట్లను ఈ నెల 15 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. అయితే, 15 నుంచి స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్) అభ్యర్థులు, 20 నుంచి ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, ఎల్పీటీ, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్ అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్జీటీ అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 24 వరకు పరీక్ష కేంద్రాల ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జనవరి 10 నుంచి ఎస్టీజీ అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులోకి తెస్తామన్నారు.