Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి నల్లగొండ పట్టణంలోని రైల్వే ట్రాక్ సమీపంలో పడేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. టూటౌన్సీఐ భాషా తెలిపిన వివరాల ప్రకారం... వ్యక్తిని హత్యచేసి పడేశారన్న విషయం సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని చింతలతండాకు చెందిన రమావత్ బాలు(33)గా గుర్తించారు. ఎక్కడో బాలును హత్యచేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్టు అనుమానిస్తున్నారు. హత్యకుగల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.