Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వాస్పత్రిలో పుట్టిన పసికందు కొద్దిసే పటికి పరిస్థితి విషమించి మృతిచెందడంతో బాధి తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బుధవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..వర్గల్ మండల శేరుపల్లి గ్రామానికి చెందిన రేణుక(21) తొలి ప్రసవం కోసం మంగళవారం ఉదయం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రసూతికి ఇంకా సమయం ఉందని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. బుధవారం తెల్లవారు జామున రేణుకకు నొప్పుులు ఎక్కువ కావడంతో వైద్యులు ప్రసవం చేశారు. అయితే పుట్టిన పాప ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేదని చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫర్ తీసుకెళ్లాలని పిల్లల వైద్యులు చెప్పారు. తల్లిని కూడా గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ అప్పటికే పసికందు పరిస్థితి విషమించి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు చనిపోయిందని కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర ప్రసాద్ అక్కడకొచ్చి వారిని శాంతింపజేశారు. డాక్టర్లపై విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గజ్వేల్ సీఐ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులను సముదాయించారు.