Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తనపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ నమోదు చేసిన అభియోగపత్రాన్ని రద్దు చేయాలంటూ సినీ దర్శకుడు మురుగదాస్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను మద్రాసు హైకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యం శుక్రవారం నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారని సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వస్తువులను ఇవ్వడాన్ని 'సర్కార్' చిత్రంలో తప్పుబట్టారని జి.దేవరాజ్ అనే వ్యక్తి కేంద్ర క్రైం బ్రాంచ్కి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన టీవీలు తప్ప మిగతా ఉచిత వస్తువులను ధ్వంసం చేసినట్టు చూపారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణను పరిశీలించిన కేంద్ర క్రైం బ్రాంచ్.. చిత్ర దర్శకుడు మురుగదాస్పై అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. దీంతో తనపై విచారణను రద్దు చేయాల్సిందిగా కోరుతూ మురుగదాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను విమర్శించడం తప్పు కాదని ఆయన తన అభ్యర్థనలో పేర్కొన్నారు. చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలను సెన్సార్ బోర్డు ముందే తొలగించిందని కూడా ఆయన వివరించారు.