Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. 178 యూనిట్ల విద్యుత్ వినియోగం చేసిన ఓ ఇంటికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ. 23 కోట్ల కరెంట్ బిల్లు వేయడం గమనార్హం. ఆ బిల్లు చూసిన ఇంటి యాజమానికి గుండె ఆగినంత పని అయింది. ఈ క్రమంలో ఇంటి యజమాని అబ్దుల్ బసిత్ మాట్లాడుతూ విద్యుత్ అధికారులు తన ఇంటికి వేసిన కరెంట్ బిల్లు.. యుపి రాష్ట్రానికి వచ్చిన మొత్తం బిల్లులా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. 178 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ. 23,67,71,524లు వేశారని చెబుతున్నాడు. తన జీవిత కాలం మొత్తం సంపాదించిన ఈ బిల్లును కట్టలేనాని అబ్దుల్ అంటున్నాడు. ఈ సంఘటనపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాదాబ్ అహ్మద్ స్పందించారు. ఈ కరెంట్ బిల్లుపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక కారణంగా వల్లే అప్పుడప్పుడు అధిక మొత్తంలో విద్యుత్ బిల్లు జనరేట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ తప్పిదాన్ని సరిచేసిన తర్వాతే వినియోగదారుడు కరెంట్ బిల్లు చెల్లించొచ్చని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాధితుడైన అబ్దుల్ బసిత్ కి సూచించారు.