Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయ్బరేలీ: తూర్పు యూపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్గా ప్రియాంకా గాంధీ ఎంపికైన నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిథ్య సింథియా పవర్ఫుల్ నేతలు అని రాహుల్ అన్నారు. యువ నేతలు యూపీ రాజకీయాలను మారుస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రియాంకా నాతో కలిసి పనిచేస్తుందని తెలిసి.. నాకు వ్యక్తిగతంగా సంతోషంగా ఉందని రాహుల్ అన్నారు. వెస్ట్ యూపీకి ఇంచార్జ్గా నియమితులైన సింథియా కూడా డైనమిక్ లీడర్ అని రాహుల్ తెలిపారు. యూపీలో మాయావతి, అఖిలేష్లతో తమకు శత్రుత్వం లేదన్నారు. వాస్తవానికి వాళ్లను గౌరవిస్తానన్నారు. వాళ్లకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ చెప్పారు. మా ముగ్గురు లక్ష్యం.. బీజేపీని ఓడించడమే అని అన్నారు.