Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ ఎంపి టిజి వెంకటేశ్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలే ప్రసక్తి లేదంటూ టిజిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిజి వెంకటేశ్ పెద్ద మనిషి తరహాలో మాట్లాడాలని లేకపోతే తాను నోరు అదుపు తప్పి మరీ మాట్లాడుతానని పవన్ కల్యాణ్ అన్నారు. అభివృద్ధి చేస్తారని భావించి తాను మద్దతిస్తేనే టిడిపి అధికారంలోకి వచ్చిందని పవన్ అన్నారు. ఏమీ ఆశించకుండా మద్దతిచ్చామని ఆయన చెప్పారు. జనసేన వద్దనుకుంటే టిజికి రాజ్యసభ సీటిచ్చారని ఆయన అన్నారు. తాను నోరు విప్పితే టిజి ఏమవుతారో జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. కిడారి, సోమ మరణించడానికి చంద్రబాబే కారణమని పవన్ ఆరోపించారు.