Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెచ్ఎండీ గ్లోబల్.. నోకియా ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఆధారంగా ఈ ఇయర్బడ్స్ డివైస్లకు కనెక్ట్ అవుతాయి. ఐపీఎక్స్4 స్వెట్, స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ను వీటికి అందిస్తున్నారు. ఎస్, ఎం, ఎల్ సైజులలో మూడు రకాల ఇయర్బడ్స్ను అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి చార్జింగ్ కేస్ను వీటికి అందిస్తున్నారు. ఎల్ఈడీ చార్జ్ ఇండికేటర్ వీటికి ఉంది. ఒకసారి ఈ ఇయర్ బడ్స్ను ఫుల్ చార్జింగ్ చేస్తే 4 గంటల వరకు నాన్స్టాప్గా ఉపయోగించుకోవచ్చు. రూ.9,999 ధరకు ఈ ఇయర్ బడ్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి.