Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రిలయన్స్ జియో రూ.297 ప్లాన్కు పోటీగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.298 ప్లాన్ను ప్రవేశపెట్టింది. 54 రోజుల కాలపరిమితితో వస్తున్న ఈ ప్లాన్లో అపరిమితంగా లోకల్, ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. రోజుకు 1 జీబీ 3జీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్సెమ్మెస్లతోపాటు 'ఈరోస్ నౌ' సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. జియో రూ.297 ప్రీపెయిడ్ ప్లాన్లో రోజుకు 3జీబీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు 28 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. వీటితోపాటు జియో యాప్స్ను ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వొడాఫోన్లోనూ ఇటువంటి ప్లానే రూ.255తో అందుబాటులో ఉంది. ఇందులోనూ అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, వంద ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. కాలపరిమితి 28 రోజులు