Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భాగ్యనగరంలో రోజురోజుకు నేరాలు ఘోరాలు ఎక్కువవుతన్నాయి. క్రిమినల్స్, రౌడీషీటర్స్పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ రోజులో ఎక్కడో చోట దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని సనత్నగర్లో సంజయ్(26) అనే వ్యక్తిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. సంజయ్.. బోరబండకు చెందిన వ్యక్తి అని స్థానికులు గుర్తించారు. ఇతను స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో గొడవే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.