Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్కోట్: పుల్వామా ఉగ్రదాడి అనంతరం గుజరాత్లోని సౌరాష్ట్రకు చెందిన 200 మంది ట్రావెల్ ఏజెంట్లు ఐదేళ్లపాటు కాశ్మీర్ టూర్కు సంబంధించి ఒక్క టిక్కెట్ కూడా బుక్ చేసుకోకూదని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా తమ దేశ భక్తిని చాటుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా తమకు రూ. 300 కోట్ల నష్టం వస్తుందని, అయినా దేశభక్తే తమకు ముఖ్యమని చెబుతున్నారు. అయితే వీరి నిర్ణయంతో కాశ్మీర్ ఏజెంట్లు ఆందోళన పడిపోతున్నారు. ఇటువంటి ఆలోచనను విరమించుకోవాలని వారు ట్రావెల్ ఏజెంట్లను వేడుకుంటున్నారు. అలాగే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీనిస్తున్నారు. కాగా ట్రావెల్ ఏజెంట్లు తీసుకున్న నిర్ణయానికి 70 మంది రైల్వే ఏజెంట్లు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ సందర్భంగా సౌరాష్ట్ర ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ అభినవ్ పటేల్ మాట్లాడుతూ.. ఈ దేశంలోని ప్రతీ జవాను జీవితం ఎంతో అమూల్యమైనదే. వారిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడివుంది. మనకు ఎటువంటి ఆపద వచ్చినా వారే మనల్ని ఆదుకుంటున్నారని అన్నారు.