Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి-భారతి దంపతులు లండన్ బయలుదేరారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు బ్రిటన్ ఎయిర్ వేస్ విమానంలో లండన్ వెళ్లిన జగన్ దంపతులు దాదాపు వారం రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చదువుతున్న కుమార్తె వర్షను చూసేందుకు వారు లండన్ వెళ్తున్నారు. తిరిగి ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ చేరుకుంటారు.