Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నార్వేలో 1300 మందితో ప్రయాణిస్తున్న ఓ నౌక ఇంజిన్లో సాంకేతిక లోపంతోపాటు ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో నిలిచిపోయింది. వైకింగ్ స్కై క్రూయిజ్ అనే నౌక సముద్రంలో చిక్కుకుందని తమను రక్షించాలని నౌకా సిబ్బంది ఎమర్జెన్సీ సందేశం పంపారని నార్వే విపత్తు నివారణా దళం ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రయాణికులను హెలీకాఫ్టర్ల ద్వారా రక్షిస్తున్నామన్న నార్వే పోలీస్ చీఫ్ టోర్ఎండ్రీ ఫ్రాంక్.. గాలులు బలంగా వీస్తున్నందున సముద్రమార్గంలో నౌకను సమీపించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. నాలుగు హెలికాఫ్టర్ల సాయంతో ప్రస్తుతం 100 మందిని రక్షించామన్న పోలీసులు.. అందరిని కాపాడేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం నౌక సముద్రతీరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉందని సహాయక చర్యలు చేపట్టామని నార్వే విపత్తు నివారణా దళ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.