Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: థాయిలాండ్ సార్వత్రిక ఎన్నికలు ఆదివారంతో ముగిశాయి. 2014లో కుట్ర తర్వాత నేషనల్ కౌన్సిల్ ఫర్ పీస్ అండ్ ఆర్డర్ (ఎన్సిపిఓ) అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సార్వత్రిక ఎన్నికలు ఇవి. కాగా పార్లమెంట్ దిగువ సభలో ఎక్కువ సీట్లు ప్రతిపక్ష పార్టీలు గెలుచుకుంటాయని అనేక పోల్స్ వెల్లడించాయి. సుయాందుసిట్ పోల్ సర్వే ప్రతిపక్ష పెహూ థాయి పార్టీ దిగువ సభలో 173సీట్లను గెలుచుకుంటుందని వెల్లడించింది. పాలక ఎన్సిపిఓ పార్టీ అనుకూల పలాంగ్ ప్రచరత్ పార్టీ 96సీట్లను గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ 88సీట్లు, ఫ్యూచర్ ఫార్వర్డ్కి 49సీట్లు వస్తాయని పోల్ ఫలితాలు తెలిపాయి. ఎన్సిపిఓ అనుకూల పార్టీ మొదటి స్థానంలో వచ్చినప్పటికీ ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే తాటిపైకి వస్తే ఆ కూటమి ప్రధమ స్థానాన్ని చేరుకోవచ్చని బ్యాంకాక్ పోల్ పేర్కొంది. మొత్తం ఓట్లలో పలాంగ్ ప్రచరత్ పార్టీకి 25.9శాతం ఓట్లు వస్తాయని పోల్ తెలిపింది. తర్వాత 25.6శాతంతో పెహూ థాయి, 20.5శాతంతో ఫ్యూచర్ ఫార్వర్డ్, 15.1శాతంతో డెమోక్రాట్స్ నిలిచారు.