Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకీబ్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి క్రిస్ లిన్(7) రషీద్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్కి వచ్చిన రాబిన్ ఊతప్పతో కలిసి నితీశ్ రాణా జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్కి 80 పరుగులు జోడించారు. అయితే సిద్ధార్త్ కౌల్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి ఊతప్ప(35) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన దినేశ్ కార్తీక్(2) సందీప్ శర్మ బౌలింగ్లో భువనేశ్వర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో రాణా వేగం పెంచాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేసి రషీద్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆఖర్లో అండ్రూ రస్సెల్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు)లతో సన్రైజర్స్కి చుక్కలు చూపించాడు. ఫలితంగా కోల్కతా ఇంకో రెండు బంతులు మిగిలి ఉండగానే.. 183 పరుగులు చేసి మ్యాచ్ని కైవసం చేసుకుంది.