Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్: జన్నారం మండలంలోని జింకల పార్కు వద్ద ఆదివారం మధ్యాహ్నం రెండు మోటర్ సైకిల్స్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జన్నారం మండలం పొన్కల్కు చెందిన జి.క్రిష్ణారావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తాను విధులు ముగించుకొని ఇంటికి మోటర్ సైకిల్పై తిరిగి వస్తుండగా జన్నారం నుండి లక్షెట్టిపేట వెళ్తున్న మరో మోటర్ సైకిల్ వాహనదారుడు జింకల పార్కు వద్ద ఎదురెదురుగా రెండు మోటర్ సైకిల్స్ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో క్రిష్ణారావుకు తీవ్రగాయాలు కాగా మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వీరిద్దరిని 108లో లక్షెట్టిపేటకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.