Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 39వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించాడు. బెంగళూరు జట్టులోకి తిరిగి ఏబీ డివిలియర్స్ వచ్చి చేరగా, సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. కాగా, డివిలియర్స్కు ఇది 150 మ్యాచ్ కావడం గమనార్హం. పాయింట్ల పట్టికలో చెన్నై అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు అట్టడుగున ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన బెంగళూరు రెండు మ్యాచులు మాత్రమే సొంతం చేసుకోగా, చెన్నై ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఏడింటిలో విజయం సాధించింది. విజయాల కోసం కసితో ఉన్న కోహ్లీ సేన ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని, పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని పట్టుదలగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.