Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో భారీ విధ్వంసం జరిగింది. ఈ దారుణ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ 200 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరగ్గా, నాలుగు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐసిస్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ ఎనిమిది చోట్ల బాంబు దాడులు జరిగాయి. అయితే కోచొకడేలోని సెయింట్ ఆంటోని చర్చిలో జరిగిన పేలుడు ఘటనను కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.