Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీలంకలోని కొలంబోలో ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య జరిగిన బాంబుపేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కేవలం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల పేలుళ్లు జరిగాయి. మూడు చోట్ల చర్చిలు, మూడు చోట్ల హోటళ్లలో ఉగ్రవాదుల జరిపిన ఈ దాడిలో సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి ప్రభుత్వం అధికారికంగా 156 మంది మరణించినట్లు ప్రకటించగా 8 గంటలకు ఆ సంఖ్య 215 కి చేరినట్లుగా ప్రకటించారు. ఇంకా గాయపడిన వారుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.