Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బెంగళూరు చిన్నస్వామి మైదానం వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు మూడు వికెట్లు కోల్పోయింది. 2.3వ బంతికి కెప్టెన్ కోహ్లీ(2) దీపక్ చాహర్ బౌలింగ్లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా వేసిన 6.5వ బంతికి ఓపెనర్ డివిలియర్స్ (25) షాట్కు ప్రయత్నించి డుప్లెసిస్ చేతికి చిక్కిపోయాడు. 99 పరుగుల వద్ద అక్షదీప్ నాథ్ (24) జడేజ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 14 ఓవర్లకు 108/3గా ఉంది. క్రీజులో పార్థివ్ పటేల్ (46), స్టోనీస్ (3) పరుగులతో ఉన్నారు.