Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని ఆ బోర్డు కార్యదర్శి అశోక్ అన్నారు. పరీక్ష రాయని విద్యార్థి కూడా ఉత్తీర్ణుడైనట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 21వేల మంది విద్యార్థుల వివరాలు గల్లంతైనట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదన్నారు. ఏ ఒక్క విద్యార్థి సమాచారం కూడా గల్లంతుకాలేదని చెప్పారు. విద్యార్థులందరి వివరాలు బోర్డు వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అన్ని అర్హతలు కలిగిన వారితోనే మూల్యాంకనం చేయించామని స్పష్టంచేశారు. ఇంటర్ ఫలితాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్పారు.