Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మంచిర్యాల పట్టణంలోని మాంసం దుకాణాలపై స్థానిక మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రక్కన అనుమతులు లేకుండా ఉన్న మాంసం దుకాణదారులకు జరిమానాలు విధించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా ఎలాంటి శుభ్రత చర్యలు పాటించకుండా దుమ్ము, దూళిలో చేపలు, మేక మాంసం విక్రయిస్తున్న 13మందికి రూ.6వేల చొప్పున జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇక ముందు ముద్ర లేని మాంసం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, చేపలు రోడ్లపై అమ్మరాదని, ఈ విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్, రమేష్, సిబ్బంది లచ్చన్న, బి.శంకర్, లింగంపల్లి పోచం, జి.సత్యనారాయణ, కె.వెంకటేశం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.