Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కానీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం ఏపీలో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం.. వైసీపీకి 132 నుంచి 135 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అధికార టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. సీపీఎస్ సర్వే ప్రకారం వైసీపీకి 133 నుంచి 135, టీడీపీ 37 నుంచి 40 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. వీడీపీఏ అసోసియేట్స్ సర్వే ప్రకారం.. వైసీపీకి 111-121, టీడీపీ 54-60 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం మళ్లీ తెలుగు దేశం పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పింది. టీడీపీ 90 నుంచి 110, వైసీపీ 70 నుంచి 80, జనసేన 1-3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని రాజగోపాల్ తెలిపారు.