Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 'మహర్షి' సినిమాను తను తప్ప మరొకరు చేయలేరని దర్శకుడు వంశీ పైడిపల్లి అనడమే అత్యుత్తమ ప్రశంస అని అగ్ర కథానాయకుడు మహేశ్బాబు అన్నారు. ఆయన నటించిన ఈ సినిమా సక్సెస్మీట్ను ఆదివారం రాత్రి విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్, పూజా హెగ్డే, దేవిశ్రీ ప్రసాద్, దిల్రాజు, అశ్వినిదత్, ప్రసాద్ వి పొట్లూరి తదితర చిత్ర బృందం వేడుకకు హాజరై, జ్ఞాపకాల్ని పంచుకుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మహేశ్ ట్వీట్లు చేశారు. తన కెరీర్లోనే 'మహర్షి' ఉత్తమ చిత్రమని పేర్కొన్నారు. 'రాత్రి 'మహర్షి' చిత్ర బృందంతో కలిసి విజయవాడలో జరుపుకున్న సక్సెస్ మీట్ ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది. సినిమాను మ్యాజికల్ సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు, నా ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు. వంశీ పైడిపల్లి.. నేను ఎంతో గర్వించదగ్గ, అత్యుత్తమ సినిమాను నువ్వు నాకిచ్చావు. మహేశ్బాబు తప్ప మరో నటుడు ఈ పాత్రను చేయలేరని నువ్వు ఆ రోజు అన్న మాటను ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటా. అది నాకు ఎప్పటికీ అత్యుత్తమ ప్రశంస బ్రదర్. మీ హృదయంతో 'మహర్షి'లాంటి మరిన్ని సినిమాల్ని తీయండి. ఇతరుల హృదయాల్ని గెలుచుకోండి. మీపై ప్రేమ, గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటాయి' మహేశ్ ట్వీట్లు చేశారు.