Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రధాని మోడీ, ఆయన గ్యాంగ్కు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా లొంగిపోయిందని ఆరోపించారు. ఈవీఎంల నుంచి మొదలుకుని ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ మేనేజ్ చేశారని విమర్శించారు. నమో టీవీ, మోడీ ఆర్మీ.. ఇప్పుడు కేదార్ నాథ్ వేదికగా డ్రామాలు చేస్తున్నారన్నారు. ఈసీ గతంలో భయ,భక్తులతో ఉండేదని.. ఇప్పుడు తెగించేసిందని మండిపడ్డారు.