Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పట్నా లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడో సారి గెలుపు తనదేనని కాంగ్రెస్ నాయకుడు, పట్నా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్న సిన్హా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన తుది విడత పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బిహార్, యూపీలో మహగత్బంధన్ చేతిలో బీజేపీ వైట్ వాష్ కావడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 120 స్థానాలుండగా, గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 100కు పైగా స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. బీజేపీలో మూడు దశాబ్దాలు పనిచేసిన శతృఘ్న... నెల రోజుల క్రితం ఆ పార్టీని విడి రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్పై ఆయన పోటీ చేశారు. అతని భార్య పూనమ్ సిన్హా కూడా లఖ్నవూ ఎస్పీ అభ్యర్థిగా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్పై ఈ ఎన్నికల బరిలో నిలిచారు. దేశంలో ఏడు దశల్లో పోలింగ్ పూర్తికాగా, మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.