Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇవాళ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను తాను నమ్మనని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై మమత బెనర్జీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎగ్జిట్ పోల్ గాసిప్స్ను తాను నమ్మనని ఆమె ట్వీట్ చేశారు. ఈ గాసిప్ ద్వారా వేల కొద్దీ ఈవీఎంలను తారుమారు చేయాలన్నదే బీజేపీ ప్లాన్ అని చెప్పుకొచ్చారు. విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా, బలంగా ఉండాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఐకమత్యంతో ఈ పోరాటం చేయాలని ఆమె విపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు.