Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణమాలు క్షణానికో రకంగా మారుతున్నాయి. బలపరీక్ష వాయిదా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు.. వాటిని అడ్డుకునేందుకు బీజేపీ యత్నాలతో కర్నాటకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రెండు సార్లు సభను వాయిదా వేసిన స్పీకర్ రమేశ్ కుమార్.. సాయంత్రం 4.30 గంటల తర్వాత తిరిగి సభను ప్రారంభించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నడుమ ప్రస్తుతం సభలో చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. విశ్వాస పరీక్ష ఆలస్యం చేయడంతో బీజేపీ నేతలు గవర్నర్ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు బలపరీక్ష జరిగే చూడాలని కోరుతూ వినతి పత్రం అందించారు. దీంతో రాజ్భవన్ గవర్నర్ వాజూభాయి ఓ ప్రత్యేక అధికారి ద్వారా స్పీకర్కు ఓ లేఖ పంపారు. ఆ లేఖను స్పీకర్ చదివి వినిపించారు. ఎలాగైనా ఈ రోజు రాత్రికల్లా బలపరీక్ష జరిగేలా చూడాలని గవర్నర్ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అటు స్పీకర్ కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు. ఈ రోజే విశ్వాస పరీక్ష జరిగేలా చూస్తామని చెప్పారు.