Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: కాంచీపురంలో అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఆస్పత్రికి తరలింస్తుండగా ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు భక్తులు కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తొక్కిసలాటలో ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మహిళ నారాయణమ్మ మృతిచెందింది.