Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. యూనివర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు, మైనార్టీ, నాన్మైనార్టీ మెడికల్ కళాశాలలు, ప్రైవేటు, ఆర్మీ డెంటల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా (బీ , సి (ఎన్ఆర్ఐ) క్యాటగిరీ) సీట్ల భర్తీకి ఆన్లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇందుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రో. రాంరెడ్డి దూరవిద్య కేంద్రం (పీజీఆర్ఆర్సీడీఈ) విభాగంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ధ్రువ పత్రాల పరిశీలన, ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 12న యూనివర్సిటీ విడుదల చేసిన మేనేజ్మెంట్ కోటా మెరిట్ జాబితాలోని అభ్యర్థులు కౌన్సిలింగ్కు హాజరు కావాలి. ర్యాంకుల వారీగా కెేటాయించిన తేదీ, సమయాల్లో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. మరింత సమాచారం www.knruhs.in , www.knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.