Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్ణాటక: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం విశ్వాసపరీక్ష రేపటికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. ఏదీఏమైనా సరే, ఈరోజే విశ్వాసపరీక్ష జరగాలంటూ వాయిదాపడ్డ సభలోనే బీజేపీ నేతలు బైఠాయించి, నిరసనలు తెలిపారు. తాజాగా, మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా ఓ లేఖ రాశారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల లోపు కాంగ్రెస్-జేడీఎస్ లు వారి మెజార్టీ నిరూపించుకోవాలని సూచించారు.