Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్లో మరింత మెరుగయ్యేందుకు బీసీసీఐ స్పిన్ సలహాదారును నియమించింది. టీమిండియా మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ స్పిన్ కోచ్ నరేంద్ర హీర్వాణికి బాధ్యతలు అప్పగించింది. ఆయన భారత్ తరఫున 17 టెస్టులు, 18 వన్డేలు ఆడారు. సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ నుంచి అందుబాటులో ఉంటారు. ఐతే ఎంపిక చేసిన సిరీస్లకు మాత్రమే ఆయన జట్టుతో కలిసి పర్యటిస్తారు.