Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 'బాహుబలి' తర్వాత 'సాహో'లో కనిపించే విధానం చాలా కొత్తగా ఉంటుందని నటుడు అరుణ్ విజయ్ అన్నారు. ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. 'సాహో' కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే పండగరాబోతోంది. ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని ప్రభాస్ చెప్పారు. ఆయనకు నా ధన్యవాదాలు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అలాంటి వ్యక్తి నటించిన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. సుజీత్ చూడటానికి చాలా చిన్నవారిలా కనిపించినా, తన విజన్ చాలా పెద్దది. జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్నితిన్ ముకేశ్ తదితర సీనియర్ నటులతో మంచి నటన రాబట్టుకున్నారు. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశం కోసం ఎంతో కష్టపడ్డారు. అది థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి ఆస్వాదించగలం. ఇప్పటికే ప్రభాస్కు తమిళంలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాతో అది మరింత పెరుగుతుంది. 'బాహుబలి'లో చూసిన ప్రభాస్కూ 'సాహో'లో చూసే ప్రభాస్కు చాలా తేడా ఉంటుంది. యాక్టింగ్, స్టైల్, నటన అన్నీ కొత్తగా ఉంటాయి. ఒక కొత్త ప్రభాస్ను చూస్తారు' అని చెప్పుకొచ్చారు.