Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒంగోలు కొత్తపట్నం రోడ్డులో కొప్పోలు వద్ద నలుగురు యువకులు తప్పతాగి మద్యం మత్తులో బైకుతో ఓ వ్యక్తిని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఒంగోలులో మద్యం తాగి అల్లూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగగా ప్రమాదం సమయంలో బైకు మీద నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించి వైద్యం చేస్తున్నారు.