Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పట్టుకున్న పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభినందన్ నడిపిన ఐఏఎఫ్ జెట్ పాక్ సరిహద్దు వద్ద కూలడంతో ఆయన పాక్ సైన్యానికి పట్టుబడటం.. ఆయనను శత్రు సైన్యం చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అహ్మద్ ఖాన్ పాక్ సైన్యం ప్రత్యేక సేవా గ్రూప్లో సుబేదార్గా పనిచేస్తున్నాడు. చొరబాటుదారులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నాక్యాల్ సెక్టార్లో ఈ నెల 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు.