Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండోర్: సోషల్ మీడియా జమానాలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, బాధ్యతా రాహిత్యం ప్రదర్శించినా వెంటనే ప్రమాదంలో పడతాం. ఇందుకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధికారుల వరకూ ఎవరూ మినాహాయింపు కాదు. తాజాగా ఇటువంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో జరిగింది. సోమవారం..కొంతమంది ఓ కుటుంబ సమస్య కారణంగా పలాసియా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. ఈ క్రమంలో అక్కడ విధులలో ఉన్న అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ ఆర్కే మిశ్రాకు, వారికీ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సదరు మహిళతో మిశ్రా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆమెతో పాటు వచ్చిన వారిపై చేయిచేసుకున్నారు. ఈ దృశ్యాల్ని కొంతమంది రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో..వారు మిశ్రాను సస్పెండ్ చేశారు. కాగా ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోం మంత్రి కూడా ఘాటుగా స్పందించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారెవరైనా ఫలితాన్ని అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.