Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయా ఆస్పత్రుల ప్రతినిధులతో మరో దఫా చర్చలు జరిపారు. నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.