Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిమ్మాపూర్: పరీక్ష రాయడానికి వచ్చిన ఓ విద్యార్థిని పట్ల ఇన్విజిలేటర్ ముసుగులో ఓ అధ్యాపకుడు అసభ్యంగా ప్రవర్తించిన తీరు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వెలుగు చూసింది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు అధ్యాపకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 19న తన మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షను రాసింది. ఇదే మండలంలోని శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో కాలేజీలో సెంటర్ పడడంతో సదరు కళాశాలకు వెళ్లి పరీక్ష రాయగా, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న బట్టు వెంకటేశ్ ఇన్విజిలేటర్గా విధులు నిర్వహించాడు. పరీక్ష రాస్తున్న సమయంలోనే వెంకటేశ్ సదరు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ నంబర్ ఇవ్వమనడమే కాకుండా.. మాటిమాటికీ దగ్గరకు వచ్చి మానసిక వేధింపులకు గురిచేశాడు. పరీక్ష అనంతరం సదరు విద్యార్థిని ఇదే విషయాన్ని జ్యోతిష్మతి కళాశాల యజమాన్యానికి, తోటి విద్యార్థులకు తెలిపింది. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది, విద్యార్థులు మంగళవారం జ్యోతిష్మతి కళాశాల అధ్యాపకులు బట్టు వెంకటేశ్ను పట్టుకొని కళాశాలకు తీసుకొచ్చారు. కళాశాల యాజమాన్యం వెంటనే ఎల్ఎండీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిమ్మాపూర్ ఎస్ఐ నరేశ్రెడ్డి తన సిబ్బందితో వచ్చి వెంకటేశ్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.