Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జ్వరానికి లక్ష రూపాయల బిల్లు. ఇది నిజమే. సినీ నటి ఐశ్వర్య సాధారణ జ్వరంతో ఆస్పత్రిలో చేరితే... లక్ష రూపాయల బిల్లు వేశారు. విశేషమేమిటంటే... ఇటీవల ఆమె తమిళంలో నటించిన చిత్రం 'మేయ్'... వైద్య వైద్య వృత్తిలో జరిగే అక్రమాలు ఇతివృత్తంగా తీసిన చిత్రమిది. తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐశ్వర్య మాట్లాడుతూ జ్వరానికి లక్ష రూపాయల బిల్లు విషయాన్ని చెప్పారు. 'కొద్ది రోజుల క్రితం నాకు జ్వరం వచ్చంది. వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళాను. ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి నన్ను వార్డులో చేర్చారు. తర్వాతి రోజు డిశ్ఛార్ఝ్ గురించి అడిగితే... ఆదివారం దాకా ఆగాలని చెప్పారు. నాకు కోపమొచ్చింది. తమాయించుకున్నా. తర్వాత బిల్లు చూస్తే షాక్ అయ్యా. కొన్ని పరీక్షలు చేసినందుకు రూ. లక్ష బిల్లు వేశారు. అయినా మరో దారి లేక బిల్లు కట్టాను' అని ఐశ్వర్య వెల్లడించారు. జ్వరం తగ్గడానికి సాధారణంగా వాడే డోలో మాత్రలు ఇచ్చి పంపించారంటూ ఐశ్వర్య అసహనం వ్యక్తం చేశారు.