Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్లా: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టును నిరసిస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తైన తరువాత తన సీటులోంచి లేచిన కాంగ్రెస్ శాసనసభాపక్షనేత ముకేష్ అగ్నిహోత్రి.. చిదంబరం అరెస్టును నిరసిస్తూ నినాదాలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి అరెస్టును ఆయన ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. దీంతో నినాదాలు ఆపాల్సిందిగా ముకేష్ అగ్నిహోత్రికి స్పీకర్ సూచించారు. మరింత రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జై రామ్ ఠాగూర్ స్పందించారు. చిదంబరం అరెస్టుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. చిదంబరం వేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడం వల్లే.. ఆయనను అధికారులు అరెస్టు చేశారని వివరించారు.