Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిందని మంత్రి కొడాలి నాని అన్నారు. అంతేకాని చంద్రబాబు చుట్టాలకు పనులు అప్పగించాలని చెప్పలేదన్నారు. కాంట్రాక్టు మారితే డబ్బులు వెనక్కి ఇవ్వాలని టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమ ఆవేదన అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దనేదే జగన్ లక్ష్యమని వెల్లడించారు. మంత్రి బొత్స వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్నారు. రాజధానిలో జరిగిన అవినీతిపై సబ్ కమిటీ వేశాం.. దోచుకున్న వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.