Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంటిగ్వా: టీమిండియా - వెస్టిండీస్ జట్ల మధ్య మరి కొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సిన తొలి టెస్టు ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం కురుస్తుండడంతో టాస్కు అంతరాయం ఏర్పడింది. దీంతో తొలి సెషన్లో ఆట కొనసాగడం అనుమానంగానే ఉందని సమాచారం. కాగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ గెలిచిన కోహ్లీసేన ఇవాళ ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ను గెలుపొందాలని భావిస్తోంది. మరోవైపు ఈ సిరీస్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని విండీస్ పట్టుదలగా కనిపిస్తోంది. కాగా టీమిండియా, విండీస్ జట్లు ఈ మ్యాచ్తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను ఆరంభించనుండటం విశేషం.