Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంటిగ్వా: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఆంటిగ్వాలోకి సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత వర్షం కురుస్తుండటంతో టాస్ని అంపైర్లు తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉండటంతో టాస్ని నిర్వహించారు. విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టీ-20 సిరీస్, వన్డే సిరీస్లను టీం ఇండియా కైవసం చేసుకొని మంచి జోష్లో ఉంది. ఇప్పడు ఈ టెస్ట్ సిరీస్ని కూడా దక్కించుకొని ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ని ఘనంగా ప్రారంభించాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు తొలి రెండు సిరీస్లను కోల్పోయిన విండీస్ ఈ సిరీస్లో విజయం సాధించి.. పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది.