Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి: సినీనటుడు రాజ్ తరుణ్ కారు ఆక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కారు ఆక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ వీడియోలు తీసిన కాస్టూమ్ డిజైనర్ కార్తిక్..తనని వీడియోలు తీసేయాలని బ్లాక్ మెయిల్ చేశారంటూ మీడియా ముందుకు వచ్చాడు. కార్తీక్ చెపుతున్న దాంట్లో వాస్తవం లేదని..రాజ్ తరుణ్ వీడియోలతో తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నటుడు రాజారవీంద్ర మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు తీసేస్తానని కార్తిక్ చెప్పాడని రాజా రవీంద్ర పీఎస్ లో కార్తిక్ పై ఫిర్యాదు చేశాడు. రాజ్ తరుణ్ కెరియర్ కు ఇబ్బందవుతుందని రూ.3 లక్షలు ఇస్తామన్న ఒప్పుకోలేదని రాజారవీంద్ర అన్నారు. మీరు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మీడియాకు వీడియోలు లీక్ చేస్తానని కార్తిక్ బెదిరించాడు. దీంతో అంత డబ్బులు ఇవ్వలేకే మేము సైలెంట్ అయ్యాము. న్యాయ పరంగా ముందుకు వెళతామని రాజారవీంద్ర తెలిపారు. ఆగస్ట్ 18న రాత్రి రాజ్ తరుణ్ నడిపిస్తున్న కారు అతివేగంగా వచ్చి ఖాళీ ప్లాటు గోడను ఢీకొట్టి నిలిచిపోయిన విషయం తెలిసిందే.