Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ఈరోజే విడుదల చేసిన నూతన ఎక్సైజ్ పాలసీలో తిరుపతిలో మద్యం దుకాణాల ఏర్పాటుపై ఆంక్షలు విధించింది. తిరుపతి ఆర్టీసి, రైల్వే స్టేషన్ నుండి అలిపిరి వరకు మద్యం దుకాణాల ఏర్పాటుపై నిషేధం విధించగా ఆర్టీసి బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం, స్విమ్స్, రుయా పరిసరాలలో మద్యం దుకాణాల ఏర్పాటును నిషేదించింది. ఈమేరకు నూతన ఎక్సైజ్ పాలసీతో పాటు ఆంక్షల ఉత్తర్వులులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది.