Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ఘట్కేసర్లో అర్థరాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వరంగల్ జిల్లా, ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన పాన్ మసాలా వ్యాపారులు కళ్యాణ్, సాయి అనే వ్యక్తులను బెదిరించి వారి నుంచి లక్షా యాబై వేల రూపాయల నగదు, 30 గ్రాముల బంగారు గొలుసులు, 16 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు, 1800 యూఎస్ డాలర్లు, 3.50 లక్షలు విలువ చేసే పాన్ మసాలాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.