Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదని సెక్యూరిటీ సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈనెల 30వతేదీ జైబాలాజీ సంస్థ అగ్రిమెంట్ ముగియనుందని, తమకు వేతనాలు ఎవరు చెల్లిస్తారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు చెల్లించే వరకు విధుల్లో చేరబోమని సిబ్బంది హెచ్చరించారు.