Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీమిండియాలో చోటు దక్కడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఎంతో ప్రతిభ, అంతకు మించిన కష్టం ఉంటే తప్ప జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడం సాధ్యం కాదు. అయితే యువ ఆటగాడు రిషభ్ పంత్ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యంతో జారవిడుచుకుంటున్నాడు. ధోనీకి ప్రత్యామ్నాయం అనిపించిన పంత్కు వరుస అవకాశాలు వస్తున్నా నిరాశపరుస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో క్రీజులో నిలిచి పరుగులు చేయాల్సిన సమయంలో పంత్ అనవసర షాట్కు ప్రయత్నించి ఔటైన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లు పంత్పై ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. పంత్.. గల్లీ క్రికెట్కు తప్ప అంతర్జాతీయ క్రికెట్కు పనికిరాడని విమర్శిస్తున్నారు. బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ షైనీల కంటే పంత్ ఘోరంగా బ్యాటింగ్ చేస్తున్నాడని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ప్రతిభావంతులను వదిలేసి పంత్కు పదేపదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే మంచి బేబీ సిట్టర్ అయిన పంత్ క్రికెట్ వదిలేసి పిల్లలతో ఆడకుంటే మంచిదని కొందరు విమర్శిస్తున్నారు. టీ-20 ప్రపంచకప్నకు ఎక్కువ సమయం లేనందున పంత్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.